Chiranjeevi: మరోసారి దర్శకుడిని తీసేసే ఆలోచనలో మెగాస్టార్

  • May 12, 2021 / 04:11 PM IST

మెగాస్టార్ చిరంజీవి కథల సెలక్షన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది యువ హీరోలు వారికంటూ ఒక స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు అంటే అందుకు మెగాస్టార్ ఆలోచనా విధానం ఎంతో ఉంది. ఇక ప్రస్తుతం వరుసగా 4 ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన మెగాస్టార్ ఒక సినిమా విషయంలో దర్శకుడిని చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది.

మళయాళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నదే. రామ్ చరణ్ ఎంతో ఇష్టపడి మెగాస్టార్ కోసం సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ సినిమా కోసం మొదట సాహో డైరెక్టర్ సుజిత్ ను అనుకున్నారు. కానీ ఆ కుర్రాడు మెగాస్టార్ అనుభవం ముందు నిలబడలేకపోయాడు. ఇక తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజాను ఫిక్స్ చేసుకున్న మెగాస్టార్ ఇప్పటికే నాలుగైదు సార్లు స్క్రిప్ట్ చెంజెస్ గురించి చర్చలు జరిపారు.

కానీ ఆ దర్శకుడు కూడా మెగాస్టార్ ను ఇంప్రెస్ చేయలేకపోతున్నట్లు సమాచారం. దీంతో దర్శకుడిని చేంజ్ చేయాలని మెగాస్టార్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవమే తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus