మెగాస్టార్ తో మైత్రి వారి మూవీ ఫిక్స్..!

  • March 20, 2020 / 10:56 AM IST

‘మైత్రి మూవీ మేకర్స్’… వారు ‘శ్రీమంతుడు’ చిత్రంతో ఎంట్రీ ఇస్తూనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అటు తర్వాత ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ వంటి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఆ ఊపు తగ్గకుండానే ‘రంగస్థలం’ చిత్రంతో మరి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకుని సరికొత్త రికార్డును సృష్టించారు. ఆ తర్వాత ‘సవ్యసాచి’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి డిజాస్టర్లతో కాస్త డిపెండ్స్ లో పడిన ఈ సంస్థ.. మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నప్పటికీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘డియర్ కామ్రేడ్’ వంటి ప్లాపులను కూడా మూటకట్టుకున్నారు. ‘మత్తు వదలరా’ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.

అయితే ఈ సంస్థ ఇప్పుడు మళ్ళీ వరుసగా పెద్ద సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే బన్నీ – సుకుమార్ చిత్రాన్ని మొదలు పెట్టేసిన ఈ సంస్థ.. పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీని కూడా అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు మరో మెగా ప్రాజెక్ట్ ను కూడా సెట్ చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవితో ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల వెంకటేష్, నాగ చైతన్యలతో ‘వెంకీ మామ’ ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. ఏమైనా మైత్రి వారికి ఇదో రికార్డు అని చెప్పాలి. ఒకేసారి ముగ్గురు మెగా హీరోలతో సినిమాలను రూపొందించడానికి సిద్దపడటం అంటే మామూలు విషయం కాదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus