నిఖిల్ తమిళ రీమేక్ కి టాప్ కెమెరామెన్

  • January 29, 2018 / 06:15 AM IST

ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కిర్రిక్ పార్టీ’ చిత్రాన్ని తెలుగులో ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ చేస్తూ యమ బిజీగా ఉన్న నిఖిల్ త్వరలోనే మరో రీమేక్ చిత్రంలో నటించేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. తమిళనాట 2016లో విడుదలైన “కనితన్”ను తెలుగులో నల్లమలుపు బుజ్జి రీమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సంతోష్ తెలుగు వెర్షన్ దర్శకత్వ బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. తమిళంలో కథానాయికగా నటించిన కేతరీన్ తెలుగులో హీరోయిన్ గా కనువిందు చేయనుంది.

ఇకపోతే.. కథ ప్రకారం మాత్రమే కాక టెక్నికల్ గానూ “కనితన్”లో చాలా సర్ ప్రైజస్ ఉంటాయి. వాటిని తెలుగులోనూ రిపీట్ చేయాలంటే మంచి కెమెరామెన్ చాలా అవసరం. అందుకే చిత్రబృందం “బాహుబలి”తో ప్రపంచస్థాయి ఖ్యాతిని దక్కించుకొన్న సెంథిల్ ను తమ సినిమా కోసం సంప్రదించగా.. “బాహుబలి” అనంతరం ఏదైనా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని చూస్తున్న సెంథిల్ కథ నచ్చడంతో వెంటనే ఒకే అనేశాడట. సెంథిల్ ఎంట్రీతో టీంకి మంచి ఎనర్జీ వచ్చింది. మార్చి నుండి సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2018 చివర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఆల్రెడీ “కిరాక్ పార్టీ” రిలీజ్ కి రెడీగా ఉండగా ఇదే ఏడాది మరో సినిమా రిలీజ్ చేసి యువ హీరోలకు కాంపిటీషన్ గా నిలవనున్నాడు నిఖిల్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus