మెగా హీరోల మధ్య పెద్దదవుతున్న గొడవ

  • February 6, 2017 / 11:45 AM IST

‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ .. ఖైదీ నంబర్ 150 మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ రీల్ లైఫ్ కి.. రియల్ లైఫ్ కి వర్తిస్తుంది. ఆయన కుటుంబంలో ఏడుమంది హీరోలున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు నిహారిక కూడా హీరోయిన్ గా నిరూపించుకుంది. ఒకే కుటుంబం నుంచి ఇంతమంది హీరోలుగా స్థిరపడడం మెగా ఫ్యామిలీకి సొంతం. వీరందరినీ కలిసి ఉంచడంలో చిరంజీవి కృషి ఉంది. అయితే అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాలీవుడ్ వర్గీయులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం బన్నీ  “చెప్పను బ్రదర్” అంటూ మెగా అభిమానుల్లో మంట పెట్టారు. మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ “ఆపలేను బ్రదర్” అంటూ అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చారు.

అప్పటి నుంచి బన్నీ, తేజు కి మధ్య మాటలను లేవని తెలిసింది. మొన్న కొత్త సినిమా ప్రారంభత్సవానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలవడంతో అల్లు కుటుంబానికి కోపం పెరిగిపోయిందని సమాచారం. అందుకే సాయి ధరమ్ తేజ్ తో చిత్రాలు నిర్మించవద్దని పెద్ద నిర్మాతలకు బన్నీ ఇండైరెక్ట్ గా ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus