ఈ కాంబో వర్కౌట్ అయితే..యాక్షన్ హీరోకి ప్లస్సే..!

  • July 18, 2020 / 03:15 PM IST

2014 లో శ్రీవాస్ డైరెక్షన్లో వచ్చిన ‘లౌక్యం’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్.. మళ్ళీ ఇప్పటి వరకూ హిట్టు మొహం చూడలేదు. ‘జిల్’ ‘పంతం’ వంటి చిత్రాలు యవరేజ్ ఫలితాలను అందించగా.. ‘సౌక్యం’ ‘గౌతమ్ నంద’ ‘ఆక్సిజెన్’ ‘చాణక్య’ వంటి చిత్రాలు అట్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు గోపీచంద్.తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

ఇక బి.గోపాల్ డైరెక్షన్లో గోపీచంద్- నయన తార జంటగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం ఓటిటిలో విడుదలవుతుంది అంటూ మొన్నటి వరకూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ.. ఇప్పుడు దాని ఊసే లేదు..! సరే ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు గోపీచంద్ కు ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. గతేడాది ‘ప్రతీరోజూ పండగే’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు మారుతీ.. గోపీచంద్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నడట.

నిజానికి ఈ కథని అల్లు అర్జున్ కోసం అనుకున్నాడట కానీ.. ఇప్పుడు ‘పుష్ప’ చిత్రంతో అతను బిజీగా ఉండడంతో మరో హీరోతో చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఈ క్రమంలో గోపీచంద్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయట. ఈ కాంబినేషన్ కనుక వర్కౌట్ అయితే.. గోపీచంద్ కు కలిసొచ్చినట్టే అని చెప్పొచ్చు..!

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus