దాసరి కి అల్లు రామలింగయ్య అవార్డుని అందజేసిన చిరంజీవి

  • May 5, 2017 / 08:09 AM IST

దర్శకరత్న దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. పరిశ్రమకు ఆయన సేవలు ఇంకా అవసరమన్నారు. దాసరి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. దాసరి నారాయణరావు ఇటీవల శ్వాస సంబంధ సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు. నిన్న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా దాసరి ఇంట సందడి కనిపించింది. చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులూ దాసరిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్‌, మోహన్‌బాబు, మురళీమోహన్‌, పరుచూరి గోపాలకృష్ణ తదితరులున్నారు.

దాసరికి బర్త్ డే విషెష్ తో పాటు అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుని చిరు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం నాచేతుల మీదుగా అందజేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అనంతరం దాసరి మాట్లాడుతూ ‘‘నాకూ అల్లు రామలింగయ్య గారికీ ఉన్న అనుబంధం ప్రత్యేకం. నేను దర్శకత్వం వహించిన దాదాపు వంద చిత్రాల్లో ఆయన నటించారు. మా మధ్య అనుబంధాన్ని మరింత బలపరిచింది ఈ పురస్కారం’’ అన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus