మహానటి చిత్రం కోసం చీరలను డిజైన్ చేయడం వెనుక కష్టాన్ని తెలిపిన గౌరంగ్ షా

  • April 18, 2018 / 05:38 PM IST

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి” షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, క్యూట్ బ్యూటీ సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించనుంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రను పోషించారు. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ 120 రకాల కాస్ట్యూమ్స్ ధరించారు. ఆ చీరల డిజైన్ వెనుక ఏడాది శ్రమ ఉందని కాస్ట్యూమ్ డిజైనర్ గౌరంగ్ షా తెలిపారు.

బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఇతను తొలిసారి తెలుగు చిత్రానికి పనిచేశారు. ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. “ఈ సినిమాకి చీరలను డిజైన్ చేయడాన్ని సవాలుగా తీసుకున్నా. ఆరు నెలలు పరిశోధించాను. వందమంది చేనేత కార్మికులతో ఆనాటి డిజైన్స్ తో చీరలను నేయించాను. మా కష్టం ఫలించింది. నాగ్ అశ్విన్ విజన్ ని చేరుకోగలిగాము. ఆ చీరల్లో కీర్తి.. సావిత్రిగా కనువిందు చేసింది” అంటూ గౌరంగ్ షా వివరించారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్  అందించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోమే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus