ఎన్టీఆర్ కోసం రాక్, ఫోక్ ట్యూన్స్ ఇస్తున్న దేవీ శ్రీ ప్రసాద్!

  • March 8, 2017 / 10:37 AM IST

ఎన్టీఆర్ 27 వ మూవీ అభిమానులకు కనుల విందే కాదు, వీనుల విందు కూడా ఇవ్వనుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రల్లో విభిన్నంగా కనిపించి అలరించనుండగా.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు ట్యూన్స్ గేయ రచయితలకు అందించినట్లు తెలిసింది. అందులో ఒకటి రాక్ అయితే మరొకటి ఫోక్. అంటే ఇటు క్లాస్, అటు మాస్ ఆడియన్స్ ఇద్దరికీ నచ్చేలా పాటల్లో బ్యాలన్స్ పాటిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ నెమ్మదిగా సాగుతోంది. రేపటి నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇక ఊపందుకోనుంది.

జై లవకుశ అనే టైటిల్ అనుకుంటున్న ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ ప్రముఖ కెమెరామెన్ సీ కే మురళీధరన్ పనిచేస్తున్నారు. హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ఎన్టీఆర్ ని విభిన్నంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన నటించనున్న ముగ్గురు భామల్లో ఒకరిగా రాశీ ఖన్నా సెలక్ట్ అయింది. మరో ఇద్దర్ని డైరక్టర్ త్వరలోనే ఎంపిక చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus