వన్ మిలియన్ క్లబ్ లో చేరిన ధృవ

  • December 14, 2016 / 07:28 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన ధృవ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, ఎన్. వి. ప్రసాద్ లు సంయుక్తం గా నిర్మించిన ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. అమెరికాలో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజుల్లో ఒక మిలియన్ డాలర్ల మార్క్ ని దాటి మెగా పవర్ ని చూపించింది.

దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #మిలియన్ డాలర్ ధృవ అంటూ సంతోషాన్ని షేర్ చేసుకుంటున్నారు. చరణ్ గత చిత్రాలు ఏది ఈ మార్క్ ని చేరుకోలేక పోయింది. తొలి సారి ధృవ ఈ ఫీట్ ని సాధించడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీకెండ్ కి తప్పకుండా 2 మిలియన్ క్లబ్ లో చేరుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలతో పాటు, పొరుగు రాష్ట్రాల్లో మొత్తం 30 కోట్లను ఈ చిత్రం రాబట్టింది. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ఇంత వసూల్ సాధించడం గొప్ప విషయమని చిత్ర విశ్లేషకులు చెబుతున్నారు. ధృవ జోరు చూస్తుంటే ఆలస్యంగానైనా అన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus