సినిమాల్లో హీరోల్లో ఫ్రెండ్స్ ఉంటారు, హీరోయిన్లలో ఫ్రెండ్స్ ఉంటారు, నిర్మాతల్లోనూ ఫ్రెండ్స్ ఉంటారు. దర్శకుల్లోనూ ఫ్రెండ్స్ ఉంటారు. మొదటి మూడు విషయాల్లో కలసి పని చేయడం సహజం. దర్శకులు అలా చేయరు. అయితే అందరిలోనూ నిర్మాతల స్నేహమే హైలైట్గా నిలుస్తూ ఉంటుంది. ఇద్దరు నిర్మాతలు కలసి సినిమాలు చేయడం అరుదే. అయితే చేసినప్పుడు భారీ విజయాలు అందుకుంటూ ఉంటారు. 14 రీల్స్, మైత్రీ మూవీ మేకర్స్, షైన్ క్రియేషన్స్.. ఇలా అన్నమాట.
అయితే మొదటి రెండు బ్యానర్ల తరహాలోనే మూడో బ్యానర్ కూడా వేరుపడటం లాంటిది ఒకటి జరుగుతోంది అని టాక్. షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి మంచి స్నేహితులు. కలసి నిర్మించిన సినిమాలు తక్కువే అయినా మంచి సినిమాలు చేస్తారు అనే పేరు సంపాదించుకున్నారు. నాగచైతన్య – సమంతల ‘మజిలీ’ చేసింది వాళ్లే. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ కూడా వాళ్లే చేశారు. అయితే ఇప్పుడు వేర్వేరుగా సినిమాలు చేసుకుంటారు అని తెలుస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం… వారి మధ్య దూరం పెరిగిందట. కారణాలు తెలియదు కానీ వేర్వేరుగా సినిమాలు చేసుకుందాం అని నిర్ణయం తీసుకుంటున్నారట. అలా షైన్ స్క్రీన్స్ నుండి హరీష్ పెద్ది వైదొలిగారని సమాచారం. ఈ మేరకు కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ను సాహు గారపాటి ఒక్కరే చూసుకుంటారట. ఇక కొత్త బ్యానర్లో గోపీచంద్ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. మరోవైపు సాహు గారుపాటి విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు అడ్వాన్సులు ఇచ్చారని చెబుతున్నారు.
షైన్ స్క్రీన్స్ (Shine Screens) సినిమాల ప్రయాణం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో ప్రారంభమైంది. ఆ తరువాతనే ‘మజిలీ’ చేశారు. ఆ సినిమా విజయం ఇచ్చిన జోష్లో ‘టక్ జగదీష్’ నిర్మించారు. ఆ తర్వాత అల్లరి నరేశ్తో ‘ఉగ్రం’ సినిమా చేశారు. ఆఖరి రెండు సినిమాలకు సరిగ్గా వసూళ్లు రాకపోయినా… ‘భగవంత్ కేసరి’ సినిమాకు మంచి వసూళ్లు, ఆదరణ దక్కింది.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!