Dil Raju: ఆశిష్ సినీ కెరీర్ పై దిల్ రాజు స్పందన.. అదే మైనస్ అయ్యింది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో హీరోలకి లైఫ్ ఇచ్చిన ఘనత ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ అధినేత దిల్ రాజు (Dil Raju) సొంతం. ఆయన బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే చాలు, సక్సెస్ ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా నాటుకుపోయింది. అయితే సొంత తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి విషయంలో మాత్రం ఈ సక్సెస్ ఫార్ములా ఎందుకో వర్కవుట్ కావడం లేదు. తొలి సినిమా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) దగ్గర నుండి నేటి వరకు ఆశిష్‌కు ఓ సాలిడ్ హిట్ అనేది అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ వ్యవహారంపై తాజాగా దిల్ రాజు పెదవి విప్పారు.

Dil Raju

ఆశిష్ (Ashish Reddy) తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) ప్రయాణం మొదలైన వెంటనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. ఎన్నో అవాంతరాలు దాటుకుని, సంక్రాంతి బరిలో సినిమాను నిలబెట్టారు. అయితే, అప్పటి పరిస్థితుల దృష్ట్యా యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిచాయి. సినిమాకు రావాల్సినంత బజ్ వచ్చినా, కమర్షియల్ గా ఆశించినంత విజయం దక్కలేదనేది ఓ అంచనా.ఆ తర్వాత సుకుమార్ (Sukumar) భాగస్వామ్యంతో ‘సెల్ఫిష్’ (Selfish) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా పట్టాలెక్కింది. క్యారెక్టరైజేషన్ ప్రధానంగా సాగే ఈ కథను ఎంతో నమ్మి మొదలుపెట్టారు. కానీ, షూటింగ్ సగం పూర్తయ్యాక, ఔట్‌పుట్ చూసుకుంటే ఎక్కడో తేడా కొట్టింది. కథనం ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదేమో అనే అనుమానం దిల్ రాజు, సుకుమార్ ఇద్దరికీ కలిగింది.

వెంటనే, సినిమాను తాత్కాలికంగా నిలిపి వేసి, పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్ణయం తీసుకుందామని హోల్డ్ లో పెట్టారు.ఇలాంటి తరుణంలో, ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామనే ఉద్దేశ్యంతో ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’ అనే మరో ప్రాజెక్ట్‌ ని ఆశిష్‌ (Ashish Reddy) తో చేశారు. కానీ, ఈ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది, సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో, దిల్ రాజు (Dil Raju) స్వయంగా కలుగజేసుకుని, ఇకపై ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం పై దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. “ఒక సినిమాను మన బ్యానర్ నుంచి నిర్మిస్తున్నామంటే, ప్రేక్షకులకు ఏం కావాలో, ఒక నటుడిగా ఆశిష్ నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించి, కథలను ఎంపిక చేయాలి.

మా బ్యానర్ కు దాదాపు 70 శాతం సక్సెస్ రేటు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అంటూ దిల్ రాజు (Dil Raju) తెలిపారు. గత 6 నెలలుగా ఈ విషయమై తీవ్రంగా కసరత్తు చేసి, ఇప్పుడు రెండు పవర్ ఫుల్ స్క్రిప్ట్ లను ఫైనల్ చేశారు.అందులో ఒకటి ‘దేత్తడి’ (వర్కింగ్ టైటిల్). ఇది పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఓ బ్యాండ్ కుర్రాడి కథ. ఈ సినిమాతో సమ్మర్ అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఇతను గతంలో నాగార్జున (Nagarjuna) తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని కూడా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం వాడుతున్నట్లు సమాచారం. ఇది కాకుండా, మరో అదిరిపోయే స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని, వారం పది రోజుల్లో ఆ ప్రాజెక్టు వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని దిల్ రాజు తెలిపారు.

2025 సౌత్ లో ఆ రికార్డు వెంకీ పేరుపై..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus