దిల్ రాజు పై ఆయన కూతురు హన్షిత రెడ్డి ఆసక్తికర కామెంట్లు వైరల్!

  • March 18, 2023 / 07:24 PM IST

‘దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్’ బ్యాన‌ర్‌ పై వచ్చిన తొలి చిత్రం ‘బలగం’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్ వేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. మార్చి 3న విడుద‌లైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఇది మంచి సినిమా, గొప్ప సినిమా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తెలంగాణ నేప‌థ్యంలో సాగే సినిమా అయినప్పటికీ ఆంధ్రాలో కూడా బాగానే ఆడుతుంది. ఇక తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్లో పాల్గొన్నారు దిల్ రాజు వారసులు హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి లు. అలాగే దిల్ రాజు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. నిజానికి చిన్న సినిమాని అయినా దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ లోనే నిర్మిస్తూ ఉంటారు. అలాంటిది కొత్త బ్యానర్ ను స్థాపించి ‘బలగం’ ని రూపొందించడం ఏంటి అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

దీనికి దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి సమాధానం ఇస్తూ.. ” శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఉండ‌గా ‘దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్’ అని స్టార్ట్ చేయ‌టానికి కారణం…. మా ఎస్‌వీసీ బ్యాన‌ర్‌లో ఇప్పుడు అన్నీ భారీ చిత్రాలే చేస్తున్నారు. వేర్వేరు లాంగ్వేజెస్‌లో చేస్తున్నారు.గతంలో ఈ బ్యానర్లో చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

డాడీ (దిల్ రాజు) కొత్త వాళ్ల‌ను ఇండ‌స్ట్రీలోకి తీసుకొచ్చి చేసే ఎక్స్‌పెరిమెంట్స్ మిస్ అవుతున్నాయి కూడా.! డిఫ‌రెంట్ సినిమాలు చేయాల‌నేదే ఈ బ్యాన‌ర్ టార్గెట్‌. అందులో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా ఉంటాయి. ఏదైనా స‌రే! కొత్త‌గా ట్రై చేయాల‌నేదే మా ప్ర‌య‌త్నం.అందుకే ఈ బ్యానర్ ను స్టార్ట్ చేయడం జరిగింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ బ్యానర్లో చేసిన మొదటి చిత్రమే సూపర్ హిట్ అవ్వడం పై కూడా ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus