ఆ కధ వేరు…ఈ కధ వేరు అంటున్న బాబి!

  • September 24, 2017 / 02:55 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటవిశ్వరూపం ‘జై లవకుశ’ రిలీజ్ అయ్యీ దాదాపుగా మూడు రోజులు అయ్యింది..ఒక పక్క ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ ఉండగానే, మరో పక్క విమర్శకుల ప్రశంసలు సైతం అనుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఈ సినిమా కధ గురించి బయట రకరకాల రూమర్స్ వస్తూ ఉన్న సంధర్భంలో దీనిపై స్పందించాడు దర్శకుడు బాబీ…అసలు ఈ సినిమా విషయంలో వచ్చిన రూమర్స్ ఏంటి అంటే…దర్శకుడు బాబి గతంలో రవితేజాకు చెప్పిన కథనే మార్చి ‘జై లవ కుశ’ గా తీసాడని అదేవిధంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ తో తీసిన ‘ఇజమ్’ తరువాత  జూనియర్ కు చెప్పిన కధలోని కొన్ని పాయింట్స్ బాబి తన ‘జై లవ కుశ’ లో కాపీ కొట్టాడు అని రకరకాల గాసీప్స్ వినిపిస్తూ ఉన్న క్రమంలో, ఈ గాసీప్స్ పై క్లారిటీ ఇచ్చాడు మన దర్శకుడు బాబీ…దీనిపై మాట్లాడుతూ…

‘జై లవ కుశ’ కథను ఎవరికీ వినిపించలేదని ఆ స్టోరీని దాదాపు ఐదేళ్ల కిందటే రాసుకున్నప్పటికీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ కు మాత్రమే వినిపించానని అంటున్నాడు. రవితేజకు చెప్పిన స్టోరీ ‘జై లవ కుశ’ కాదని ఆ స్టోరీతో త్వరలోనే రవితేజతో సినిమా ఉంటుందని అంటూ మరో క్లారిటీ ఇస్తున్నాడు బాబి. వాస్తవానికి ‘జై లవ కుశ’ కంటే ముందు ఎన్టీఆర్ కోసం మరో స్టోరీ రాసుకున్నాడట ఈ దర్శకుడు. ఆ స్టోరీ జూనియర్ కు చెబుదామని 2, 3 సార్లు ప్రయత్నించాడట అయితే అనుకోకుండా ‘జై లవ కుశ’ కథ ఓకే అవ్వడంతో మరో స్టోరీలైన్ జూనియర్ కు  వినిపించే అవసరం కలగలేదు అంటున్నాడు బాబి. మొత్తంగా చూసుకుంటే బాబీ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు…ఇక  సర్దార్ సినిమాతో కాస్త డీలా పడ్డ బాబీ…ఇదే ఊపుతో మంచి సినిమాలు అందిస్తాడు అని ఆశిద్దాం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus