నాగార్జున, నాని మల్టీ స్టారర్ చిత్రానికి డైరక్టర్ ఎవరో తెలుసా?

  • September 11, 2017 / 09:55 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక సక్సస్ రేట్ కలిగిన హీరో నాని. అందుకే అతనితో సినిమాలు చేయాలనీ నిర్మాతలు, దర్శకులు క్యూ కడుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే మాదిరిగా నేచురల్ స్టార్ క్రేజ్ ఉన్నప్పుడే చకచకా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) చేస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలో పూర్తికానుంది.  ఈ చిత్రం తర్వాత  యువ దర్శకుడు మేర్లపాక గాంధీ  21 వ ప్రాజక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి “కృష్ణార్జున యుద్ధం” అనిపేరు కూడా ఫిక్స్ చేశారు. ఈ రెండింటితో పాటు మణిరత్నం సినిమాలో కీలకరోల్ పోషించనున్నారు.

వీటి తర్వాత నాని, అక్కినేని నాగార్జునతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా  చేయబోతున్నట్లు సమాచారం. ఊపిరి సినిమా ఇచ్చిన ఉత్సాహంతో నాగ్ యువహీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి కనబరిచారు. అందుకే భలే మంచి రోజు, శమంతకమణి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న  శ్రీరామ్ ఆదిత్య  మల్టీ స్టారర్ కథ చెప్పగానే నాగార్జున ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాకి సంబందించిన పనులు మెల్లగా జరుగుతున్నాయి. నాగార్జున రాజుగారి గది 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రం గురియించి అధికారిక ప్రకటన రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus