Director Krish, Mahesh Babu: మహేష్ శివమ్ పై క్లారిటీ ఇచ్చిన క్రిష్!

  • October 8, 2021 / 02:01 PM IST

గమ్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ జాగర్లమూడి(క్రిష్) మొదటి అడుగులోనే తానేంటో నిరూపించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ దర్శకుడి సినిమాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంటాయి. వేదం కంచె నుంచి గౌతమిపుత్ర శతకర్ణి వరకు అన్ని సినిమాల్లో ఎదో ఒక మంచి పాయింట్ ను హైలెట్ చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఈ దర్శకుడితో సినిమా చేయడానికి అందరూ హీరోలు సిద్ధంగా ఉంటారు. ఒకనొక సమయంలో మహేష్ బాబు కూడా క్రిష్ తో సినిమా చేయాలని చాలా ఆసక్తిని చూపించారు.

కానీ ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. కంచె సినిమా చేసిన అనంతరం మహేష్ బాబుతో సినిమా చేయాలని శివమ్ అనే కథను రాసుకున్న క్రిష్ రెండు నెలల వరకు స్క్రిప్ట్ పై రీ వర్కౌట్ కూడా చేశాడట. అయితే ప్రాజెక్ట్ ఫైనల్ గా అనుకున్నట్లు సెట్టవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు క్రిష్ క్లారిటీ ఇచ్చారు. అయితే మహేష్ బాబుతో తప్పకుండా ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఆయితే ఉందని ఈ దర్శకుడు అన్నాడు.

ఇక క్రిష్ ప్రస్తుతం కొండపొలం సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. శుక్రవారం విడుదల అవుతున్న ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక వరల్డ్ వైడ్ గా 7కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అవుతోంది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఈజీగా అందుకుంటుందని టాక్ వస్తోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus