Krishna Vamsi: అమ్మాయిలు అర్ధరాత్రి వరకే కాదు.. తెల్లవారే వరకు ఒంటరిగా తిరుగుతున్నారు!

  • August 16, 2022 / 02:31 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణవంశీ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈయన దర్శకత్వంలో ఖడ్గం వంటి దేశభక్తి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని స్వాతంత్రానికి తనదైన శైలిలో అద్భుతమైన అర్థాన్ని ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో తాను ఎన్నో దేశాలలో తిరిగానని అయితే చాలా దేశాలలో బానిసత్వాన్ని హైలైట్ చేస్తున్నారని వెల్లడించారు.

బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో కూడా భారతీయులు ఉన్నారని, మనవాళ్లు కూడా అప్పట్లో ఇంగ్లాండ్ వెళ్లి చదువుకొని వచ్చిన వారే అంటూ ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడారు. విభజన అనేది ఎప్పటికీ రాకూడదు అందరూ ఒకటే అనుకుంటే ఎలాంటి గొడవలు ఉండవని ఈయన పేర్కొన్నారు. మనదేశంలో ఎప్పుడైతే ఒక ఆడపిల్ల అర్థ రాత్రి ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అంటూ మహాత్మా గాంధీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అర్ధరాత్రి వరకు కాదు తెల్లవారే వరకు ఆడపిల్లలు ఒంటరిగా తిరుగుతున్నారు అంటూ కృష్ణవంశీ తెలిపారు.

జాబులు చేసుకుంటూ ఆడపిల్లలు తెల్లవారే వరకు తిరుగుతున్నారు. స్వాతంత్రం లేదని ఎందుకు అనుకుంటాం అంటూ ఈయన మాట్లాడారు. అయితే కొంతమంది వెధవలు నీచులు ఎప్పటికీ ఉంటారు. ఇలాంటి వారి వల్ల అమ్మాయిలు రోడ్లపై తిరగలేదనే పరిస్థితి లేదనేది కాదు అమ్మాయిలు కూడా ఎంతో ధైర్యంగా వారి పనులు వారు చేసుకుంటున్నారు ఏ కొంతమందిలో ఇలాంటి నీచమైన వెదవలు ఉంటారు.

అసలు అన్ని జంతువులలో కెల్లా నీచమైన నికృష్టమైన జంతువు మనిషి మాత్రమేనని ఈ సందర్భంగా ఈయన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus