శ్రీ రెడ్డి ఆరోపణలకు ముగింపు పలకండి : రాజేందర్

  • July 14, 2018 / 02:59 PM IST

నటనతో కంటే కాంట్రవర్సీలతో పాపులర్ అయిన నటి శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ అంటూ మొదలెట్టి మీడియా ముందు బట్టలు విప్పుకొని వార్తల్లో నిలిచింది. స్టార్ హీరోలు, దర్శకులపై విమర్శలు చేసి.. నోటీసులు అందుకుంది. రోజుకొకరిని విమర్శిస్తుండడంతో ఆమెను తెలుగు మీడియా సైతం దూరం పెట్టింది. దీంతో ఆమె దిక్కుతోచక కోలీవుడ్ మీద పడింది. కొరియోగ్రాఫర్, డైరక్టర్ లారెన్స్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తాజాగా ఆరోపణలు చేసింది. కోలీవుడ్ లోని ప్రముఖుల రాసలీలల గురించి బయటపెడతానని శ్రీరెడ్డి ఈరోజు హెచ్చరించింది. ఆమె మాటలు ప్రస్తుతం కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

శ్రీ రెడ్డి తమిళ పరిశ్రమపై ఆరోపణలు చేయడాన్ని అక్కడి పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నారు. శ్రీ రెడ్డి ఆరోపణలపై ఎవ్వరూ స్పందించక పోవడం సరికాదంటూ ప్రముఖ దర్శకుడు, నటుడు టి. రాజేందర్  మీడియా సమావేశంలో వాపోయారు. ” సినిమా ఇండస్ట్రీలో మంచితో పాటు చెడు కూడా ఉందని.. అలాగని అందరూ చెడ్డవారు కాదు. నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎప్పుడూ హీరోయిన్‌ను టచ్ కూడా చేయలేదు.  శ్రీ రెడ్డి ఎవరిపై అయితే ఆరోపణలు చేస్తుందో వారు వెంటనే స్పందించాలి. ఈ సమస్యకు ఇంతటితో ముగింపు పలికితేనే మంచిది” అని అభిప్రాయం పడ్డారు. అతని పిలుపుకు కోలీవుడ్ దర్శకనిర్మాతల సంఘం, ఆర్టిస్టుల సంఘం స్పందించింది. శ్రీ రెడ్డి పై లీగల్ గా అటాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus