లోఫర్ భామకు షాకిచ్చిన హైదరాబాదీలు!

  • October 13, 2016 / 12:08 PM IST

క్యాడ్ బరీ డైరీ మిల్క్ యాడ్ లో ముద్దులొలుకుతూ అందరినీ ఆకట్టుకున్న మోడల్ దిషా పటాని. ఈ ఒక్క యాడ్ తో ఆమె వెండి తెర అవకాశం పొందింది. తెలుగులో పూరి జగన్నాథ్  దిషా ను పరిచయం చేశారు. లోఫర్ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ఈ భామ తాజాగా “ఎం.ఎస్.ధోని: అన్ టోల్డ్ స్టోరీ” లో మెరిసింది. దీంతో బాగా పాపులర్ అయింది.

దిషా రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఇక్కడ తనకి ఎవరూ ఫ్యాన్స్ ఉండరని భావించిన ఆమె కారు నుంచి సాధారణ అమ్మాయిలా దిగింది. కానీ అప్పటికే తన అభిమాన నటి కోసం ఎదురు చూస్తున్న హైదరాబాదీ ఫ్యాన్స్ ఆమె  చుట్టూ మూగారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి దిషా ఆశ్చర్యపోయింది. షాక్ కి గురైంది.

అభిమానులను ఆమెను కాసేపు ఉక్కిరిబిక్కిరి చేశారు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది గుంపు నుంచి దిషాని స్టోర్ వద్దకు తీసుకుపోయారు. తనని ఎవరూ గుర్తించని ధీమాతో వచ్చిన బాలీవుడ్ నటికి హైదరాబాదీ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus