జై లవకుశ డ్రామా సీన్ తన ఐడియా కాదన్నా బాబీ!

  • September 25, 2017 / 11:18 AM IST

జై లవకుశ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది  డ్రామా సీన్. ఇందులో ముగ్గురు ఎన్టీఆర్ లు స్క్రీన్ పై కనిపిస్తారు. మూడు విభిన్న క్యారెక్టర్స్ తో తారక్ చాలా బాగా నవ్వించారు. అందుకే ఆ సన్నివేశం అందరిమదిలో నిలిచి పోయింది. అయితే ఇది దర్శకుడు బాబీ ముందుగా రాసుకున్న కథలో లేదంట. విచిత్రంగా ఉంది కదూ. ఇది నిజం. రీసెంట్ గా ఈ విషయాన్నీ బాబీ చెప్పారు. ” జై లవకుశ కథ ను కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ , హరికృష్ణ లకు వినిపించిన తర్వాత, వారు ముగ్గురు కలిసి ఈ కథ లో ఓ డ్రామా సీన్ ఉంటే బాగుంటుందని చెప్పారు. నాకు ఆ ఐడియా నచ్చింది. కథలో ముగ్గురు ఎన్టీఆర్ ల ఓ డ్రామా సీన్ జోడించాను.” అని బాబీ వివరించారు.

ఇప్పుడు ఆ సీన్ సినిమాలో ఒక హైలెట్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ మూవీ గత గురువారం రిలీజ్ అయి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో కేవలం  తెలుగు రాష్ట్రాల్లోనే 62 కోట్ల గ్రాస్ ను, 40 కోట్ల షేర్ ను రాబట్టుకుని ఎన్టీఆర్ సత్తాని చాటింది. వందకోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus