అక్కడ రెస్పాన్స్ కి దేవి షాక్ !

  • June 22, 2017 / 12:47 PM IST

టాలీవుడ్ నుంచి కోలీవడ్ వరకూ యువ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలియని వారు ఉండరు. ముద్దుగా డీఎస్పీ అని పిలుచుకునే ఏ యువ సంగీత సంచలనం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా బన్నీ దిల్ రాజు సినిమా అయినటువంటి డీజె కి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన మన డీఎస్పీ ఇండస్ట్రీ లో టాప్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా చాలామణీ అవుతూ ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మన దేవికి షాక్ ఇచ్చారు మన ఎన్.ఆర్.ఐలు. ఏమయింది అంటే…ఒకసారి ఈ కధ చదవాల్సింది…మ్యాటర్ లోకి వెలితే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన ఈ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ మ్యానియా ఏ స్థాయిలో ఉందో మనం ఇట్టే చెప్పనవసరం లేదు. అయితే ఇలాంటి పరిస్థుతులలో ఇంత క్రేజీ డైరెక్టర్ ఈమధ్య ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలలో నిర్వహించిన స్టేజ్ షోలు అత్యంత ఘోరంగా విఫలం కావడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

దేవీశ్రీప్రసాద్ తన మ్యూజిక్ షోలకు భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఒక ఈవెంట్ మ్యానేజిమెంట్ కంపెనీతో ఎగ్రిమెంట్ చేసుకుని సుమార్ 3 కోట్లు ఆదాయాన్ని టార్గెట్ చేసుకుని తన టోటల్ టీమ్ తో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ పర్యటనకు ఈమధ్య వెళ్ళాడు. అదే క్రమంలో షొలకు 200 వందల డాలర్లను టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఇక్కడే అసలు మ్యాటర్ మొదలయింది, దేవీశ్రీప్రసాద్ కు ఎంత క్రేజ్ ఉన్నా ఈ భారీ మొత్తంలో పెట్టిన టిక్కెట్ కు స్పందన మాత్రం కరువయింది….ఇక చేసేది ఏమీ లేక….దేవితన పర్యటను త్వరగా ముగించుకుని తిరిగి ఇండియా వచ్చేశాడు ని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం. మొత్తంగా చూసుకుంటే టాలీవుడ్ ని తన సంగీతంతో ఉర్రూతలూగిస్తున్న దేవికి పాపం అక్కడి వాళ్ళు మాత్రం భారీ షాక్ ని మిగిల్చారు…


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus