నిర్మాతకి షాక్ ఇచ్చిన ఫిదా బ్యూటీ

  • September 1, 2018 / 12:36 PM IST

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుందని ఆమె సినిమాలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. స్టార్ హీరో, భారీ రెమ్యునరేషన్, అనే సంగతులను పక్కన పెట్టి మంచి పాత్రలకు మాత్రమే విలువ ఇస్తుంది. కాసేపు అందాలు ఆరబోసి బోలెడు పారితోషికం అందుకోవడం ఆమెకు అసలు ఇష్టముండదు. అది నిజమని తాజా సంఘటన మరోమారు స్పష్టం చేసింది. “ప్రేమమ్(మలయాళం)” సినిమా ద్వారా సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చి… అభినందనలను అవార్డులను అందుకుంది. తెలుగులో ఫిదా మూవీలో అచ్చమైన తెలంగాణ అమ్మాయి భానుమతిలా నటించి అందరి మనసులు గెలుచుకుంది.

మిడిల్ క్లాస్ అబ్బాయి లోను నాని కి జోడిగా చలాకీగా నటించి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. విభిన్నమైన కథతో చేసిన ద్వి భాష చిత్రం “క‌ణం”లో నాలుగేళ్ల పాప‌కి త‌ల్లిగా సాయిప‌ల్ల‌వి నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “పడి పడి లేచే మనసు” సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటిస్తోంది. ఆమె క్రేజ్ చూసి ఓ నిర్మాత తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమని కోరారంటా.. భారీ రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. వందకోట్లు ఇస్తామన్నా ఐటెం సాంగ్ చేయనని ఖరాఖండిగా సాయి పల్లవి చెప్పిన్నట్లు సమాచారం. దీంతో ఈ న్యూస్ అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను హాట్ టాపిక్ అయింది. సాయి పల్లవి దగ్గరికి వెళ్లేముందు కథ, క్యారెక్టర్ బాగుండాలని.. లేకపోతే వెళ్లడం వృధా అని ఫిలిం మేకర్స్ మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus