చిరు-చరణ్ లమధ్య భీకరపోరు సెట్ చేసిన కొరటాల?

  • June 15, 2020 / 06:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య అనే టైటిల్ ప్రచారంలో ఉండగా ఇప్పటికే ఈ మూవీ 40శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో షూటింగ్స్ కి అనుమతి లభించిన నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. ఆచార్య సినిమాలో ఓ కీలక రోల్ చరణ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కథలో ప్రాధాన్యం ఉన్న అర గంట నిడివితో సాగే ఓ పాత్ర కోసం చరణ్ ని తీసుకోవడం జరిగింది. కాగా చిరంజీవి, చరణ్ మధ్య కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయో లేదో అనే సందేశం కొనసాగుతుండగా వీరి మధ్య ఓ ఫైట్ సన్నివేశం కూడా ఉంటుందనే న్యూస్ బయటికి వచ్చింది. సినిమా సెకండ్ హాఫ్ లో వీరిద్దరి మధ్య కొరటాల ఓ ఫైట్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట. వ్యవస్థ పట్ల విరుద్ధ భావాలు కలిగిన వీరిద్దరి పాత్రల మధ్య సంఘర్షణ ఉంటుందని వినికిడి.

మరి ఇదే కనుక జరిగితే చిరు, చరణ్ ల మధ్య ఓ భీకర పోరు ఆవిష్కృతం కావడం ఖాయం. కొరటాల ఈ చిత్రాన్ని సామజిక అంశంతో కూడిన కమర్షియల్ సబ్జెక్టు గా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్వయంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150లో నటించిన కాజల్ ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తరువాత సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus