Gautham Menon: ఆ సినిమా వాయిదాపై గౌతమ్ మీనన్ ఎమోషనల్.. ఏమైందంటే?

  • February 29, 2024 / 01:17 PM IST

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని స్టార్ డైరెక్టర్లలో గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఒకరు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ మాయ చేశావె సినిమాతో గౌతమ్ మీనన్ తెలుగు ప్రేక్షకులను సైతం మాయ చేసేశారు. అయితే ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ధృవనక్షత్రం సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ధృవనక్షత్రం సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడటం గురించి ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాయిదా పడటం హృదయ విదారకంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేదని ఆయన కామెంట్లు చేశారు. నా కుటుంబం సైతం ఆందోళన చెందుతోందని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. నా భార్య నెల రోజులుగా ఈ విషయం ఆలోచిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. నాకు ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తోందని కానీ పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నానని గౌతమ్ మీనన్ వెల్లడించారు.

మార్చి నెల 1వ తేదీన జాషువా సినిమా రిలీజ్ కానుందని ఈ సినిమాకు ముందే ధృవ నక్షత్రం సినిమాను రిలీజ్ చేయాలని భావించడం జరిగిందని గౌతమ్ మీనన్ కామెంట్లు చేశారు. అది కుదరలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. 2016 సంవత్సరంలో ధృవనక్షత్రం సినిమా సెట్స్ పైకి వెళ్లగా 2017లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయింది.

శింబుతో ఒక సినిమా కోసం ఒప్పందం కుదుర్చుకున్న (Gautham Menon) గౌతమ్ మీనన్ ఆ సినిమాను పూర్తి చేయకపోవడంతో ఆ నగదు తిరిగి చెల్లించే వరకు ధృవ నక్షత్రం మూవీ విడుదల కాకుండా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. ఈ సినిమా ఎప్పటికి థియేటర్లలో రిలీజ్ అవుతుందో చూడాల్సి ఉంది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus