Genelia , Riteish Deshmukh: అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?

  • July 9, 2024 / 11:50 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ జెనీలియాకు (Genelia) మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. జెనీలియా తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన సమయంలో జెనీలియా తన ఓటు హక్కును హైదరాబాద్ కు వచ్చి మరీ వినియోగించుకున్నారు. జెనీలియా భర్త పేరు రితేశ్ దేశ్ ముఖ్ కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రితేశ్ కు మంచి గుర్తింపు ఉంది.

జెనీలియా, రితేశ్ దేశ్ ముఖ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. జెనీలియా, రితేశ్ అవయవ దానం చేస్తున్నట్టు ప్రకటించగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఈ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జెనీలియా, రితేశ్ దంపతులు మనుషులు అందంగా ఉంటారని వాళ్ల మనస్సులు కూడా అందంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవయవదానం చేయడం వల్ల అవయవాలు లేని ఎంతోమంది జీవితాలలో మార్పు వస్తుందనే సంగతి తెలిసిందే. నేను, జెనీలియా మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశామని రితేశ్ దంపతులు పేర్కొన్నారు. రితేశ్ ప్రస్తుతం కాకుడ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రితేశ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

రితేశ్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని భోగట్టా. రితేశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు జెనీలియాకు సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జెనీలియా రాబోయే రోజుల్లో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus