ఓ సినిమా ఇబ్బందికర ఫలితం అందుకుంటే.. ఆ హీరో మహా అయితే ఓ నెల డౌన్లో ఉంటాడు. కానీ ఆ దర్శకుడు చాలా ఏళ్లు డౌన్ అయిపోతారు. తిరిగి ఎప్పుడు కోలుకుంటారు అనేది చెప్పాలేం. కొందరికి నెల పడితే.. ఇంకొందరికి రెండు, మూడేళ్లు పడుతుంది. ఇలాంటి సమయంలో ‘నేనున్నా’ అంటూ ఆ దర్శకుడికి అండగా నిలిచేది చాలా తక్కువమంది. ఆ చాలా తక్కువమందిలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన ‘నేనున్నా’ అనే మాట అన్నది మరో దర్శకుడు హరీశ్ శంకర్తో.
పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన వరుసగా మీడియాతో మాట్లాడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తన ఫ్లాప్ డేస్ గురించి మాట్లాడారు. సినిమా ఫ్లాప్ అయి తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ తనను మూడేళ్లు పోషించారని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి రాకముందు తనపై యండమూరి వీరేంద్రనాథ్ ప్రభావం ఉండేదని.. ఇండస్ట్రీకి వచ్చాక పూరి ప్రభావం అంతకన్నా ఎక్కువ ఉందని చెప్పారు.
తెలుగు సినిమా పరిశ్రమలో తనలో స్ఫూర్తినింపిన వ్యక్తి పూరి అని పొగిడేశారు హరీశ్. తన మొదటి సినిమా ‘షాక్’ సరిగ్గా ఆడనప్పుడు ఆయనే పిలిచి రామ్ చరణ్ హీరోగా తొలి సినిమా చేస్తున్నాం. నువ్వు నాతోనే ఉండు. పెళ్లై కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తి తీసిన సినిమా ఆడకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పారని హరీశ్ తెలిపారు. రైటర్గా రెండు, మూడేళ్లు ట్యాగ్ ఇచ్చి నన్ను పోషించారు. ఆయన చేసిన సాయం నా జీవితంలో మర్చిపోలేను అని చెప్పారు.
‘షాక్’ సినిమా వరకు రవితేజ హెల్ప్ చేశారు.. ఆ తర్వాత పూరి చేరదీశారు. సినిమా మేకింగ్ అంటే ఏంటో వివరించారు. ఆయనతో పనిచేయడం పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పారు. పవన్ కల్యాణ్తో ఎన్నో ఏళ్ల తర్వాత హరీశ్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 19న విడుదలవుతోంది.