ఎన్టీఆర్ యాక్సిడెంట్ వార్తలను ఖండించిన సన్నిహితులు

  • March 13, 2018 / 09:12 AM IST

రెండు రోజుల క్రితం టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌కు యాక్సిడెంట్ అయిందని సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ వార్తలు చాలా ఇబ్బంది పెడుతుండడంతో శ్రీకాంత్ స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని, తను క్షేమంగా ఉన్నానని చెప్పారు. ఇలాంటి వార్తలు వల్ల కుటుంబసభ్యులు ఆందోళన పడతారని, లైక్లు, వ్యూస్ కోసం ఇలా రాయవద్దని సూచించారు. అయినా ఇటువంటి గాసిప్స్ ఆగడం లేదు. రాజమౌళి సినిమా ఫోటో షూట్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని నిన్న సోషల్ మీడియాలో గాసిప్ హల్ చల్ చేసింది. ఈ వార్తతో తారక్ అభిమానులు కంగారు పడ్డారు.

తమ హీరో ఎలా ఉన్నారంటూ ఆరాతీయడం మొదలెట్టారు. దీంతో ఎన్టీఆర్ సన్నిహితులు స్పందించారు. అసలు ఎన్టీఆర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. తారక్ చాలా ఆరోగ్యాంగా ఉన్నారని స్పష్టం చేశారు. లాస్ ఏంజిల్స్ లో ఫోటో షూట్ పూర్తి చేసుకొని నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారని వెల్లడించారు. రెస్ట్ తీసుకోకుండా వచ్చిన వెంటనే జిమ్ కి వెళ్లారని, వ్యాయామం చేయడంలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఇటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని కోరారు. జై లవకుశ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ చిత్రం కోసమే తారక్ మరింత ఫిట్ గా తయారవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus