నిఖిల్ ఎమోషనల్ లెటర్.. అందుకే?

  • April 26, 2019 / 04:18 PM IST

నిఖిల్ హీరోగా టి.ఎన్.సంతోష్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. గత కొన్ని నెలలుగా ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఎట్టకేలకు మే 1 న విడుదల చేయాలని భావించినా.. ఏప్రిల్ 26న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ భారీ స్థాయిలో విడుదలవుతుండడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాలని కోరారు . వారి రిక్వెస్ట్ ను గౌరవించి సినిమా విడుదలను వాయిదా వేయబోతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ వార్త తెలుసుకున్న నిఖిల్ నిరాశచెందాడట.

ఇప్పటికే ఈ చిత్రం కోసం తెగ ప్రమోషన్స్ చేస్తున్నాడు నిఖిల్. దీంతో సినిమా విడుదల మరోసారి వాయిదాపడింది అనే విషయం బాధపెట్టినప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని నిఖిల్ తన సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను కూడా విడుదలచేశాడు. ఈ లేక ద్వారా నిఖిల్ .. “ఒక సంవత్సరం గ్యాప్.. మంచి సినిమాతో ఒక మంచి పాయింట్‌తో నాతో పాటు చాలా మంది టెక్నీషియన్స్ చాలా కష్టపడి కార్మిక దినోత్సవం రోజు మీ అందరి అభిమానం కోసం రావడానికి ఎదురుచూస్తున్న టైమ్‌లో అవేంజెర్స్ లాంటి ఎదురుదెబ్బ.. ఎలా ఐతే అవెంజర్స్ ధానోస్‌ని ఎదిరించి ప్రపంచం కోసం పోరాడుతారో.. ‘అర్జున్ సురవరం’ కూడా స్టూడెంట్స్ కోసం పోరాడతాడు. ఇలాంటి ఒక పాయింట్ ఉన్న సినిమాని చూసి నచ్చి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు వాయిదా వేస్తున్నాం” అంటూ తెలిపాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus