బాలు అంత్యక్రియల్లో పాల్గొన్న విజయ్

  • September 26, 2020 / 01:14 PM IST

కోలీవుడ్ స్టార్ విజయ్ ఎస్పీ బాలు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు జరుగుతుండగా విజయ్ అక్కడకు చేరుకున్నారు. బాలు కుమారుడైన ఎస్పీ చరణ్ ని ఆయన కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అత్యక్రియలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక బాలు పార్థివ దేహాన్ని ఆయన దర్శించడం జరిగింది. బాలుగారికి విజయ్ నివాళులు అర్పించారు. బాలు అకాల మరణానికి విజయ్ భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ నటించిన అనేక సినిమాలలో పాటలను బాలు పాడడం జరిగింది.

ఇక చెన్నైలో ఉన్న చిత్ర ప్రముఖులు బాలు అంత్యక్రియలకు హాజరు అవుతున్నారు. కరోనా నేపథ్యంలో వయసు రీత్యా కొందరు బాలు అంతిమ సంస్కారాలకు హాజరు కాలేక పోతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ బాలు అంత్యక్రియలకు హాజరు అయ్యారు. ఆయన బాలు పార్దీవ దేహాన్ని సందర్శించడంతో పాటు, బాలుతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సంగీత దర్శకులు, సింగర్స్, పాటల రచయితలు అందరి తరపున బాలు గారికి తాను నివాళులు అర్పిస్తున్నట్లు దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు.

1

2

3

4

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus