తల్లిదండ్రులే నమ్మలేదు : కరోనా టైంలో కూడా చరణ్ బిజీ బిజీ : నాగబాబు డీపిలో బాలయ్య

  • April 16, 2021 / 07:08 AM IST

భాషతో సంబంధం లేకుండా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రష్మిక మందన్నా గుర్తింపును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం రష్మిక మందన్నా గట్టి పోటీని ఇస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ తో గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమాలు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా రష్మిక ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.Click Here To Read

కరోనా పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో ‘ఆచార్య’ బృందం వేగం పెంచింది. పరిస్థితులు మరీ చేయి దాటకముందే సినిమా చిత్రీకరణను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నాడట. ఇప్పటికే చిరంజీవి మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించిన కొరటాల… ప్రస్తుతం రామ్‌చరణ్‌ సీన్స్‌ పనిలో పడ్డాడట. విరామం లేకుండా వరుసగా చరణ్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నారట. ‘ఆచార్య’లో చిరంజీవి హీరో కాగా, రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర అని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత రామ్‌చరణ్‌ది కీలక పాత్ర అన్నారు.Click Here To Read

నందమూరి బాలకృష్ణ, రామ్‌గోపాల్‌ వర్మ… నాగబాబు మధ్య ఏం జరుగుతోంది. ఏముంది… ఆ ఇద్దరిపై నాగబాబు ఆ మధ్య కాంట్రవర్శీ కామెంట్లు చేశారు. అంతకుముందు వారు కూడా ఏదో అన్నారని టాక్‌. ఇది ఎవరికైనా తెలుసు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య సఖ్యత ఏర్పడిందా? ఈ మాట మేము అనడం లేదు. నాగబాబు ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం చూస్తే ఇదే అనిపిస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నాగబాబు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా మరోసారి ఆ ముచ్చట్లలో బాలకృష్ణ, ఆర్జీవీ ప్రస్తావన వచ్చింది.Click Here To Read

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus