నితిన్ ‘రంగ్ దే’ రేంజ్ పెరిగిపోతుందిగా…!

  • September 25, 2020 / 11:15 PM IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. మొన్నటి వరకూ ఈ చిత్రం ఓటిటిలోనే విడుదలవుతుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఫైనల్ గా ఆ డీల్ క్యాన్సిల్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ముందుగా ‘రంగ్ దే’ కోసం అనుకున్న బడ్జెట్ ఇప్పుడు మించిపోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని కూడా తెలుస్తుంది. విషయం ఏమిటంటే.. ఈ చిత్రం కథ ప్రకారం హీరో ఇల్లు అమెరికాలో ఉంటుందట. ఆ ఇంట్లోనే హీరో, హీరోయిన్ల మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. అయితే అమెరికాలో ఉండే హీరో ఇల్లు కోసం హైదరాబాద్ లోనే సెట్లు వేస్తున్నారని తెలుస్తుంది.

ఈ ఇంటి సెట్ కోసమే నిర్మాతలు ఏకంగా 1.5కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా సమాచారం. సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ ఇంటి సెట్ ను చాలా బాగా చూపిస్తారని… ఇందుకు తగిన విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇంటి సెట్ కోసమే 1.5కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు రావడంతో.. ‘రంగ్ దే’ బడ్జెట్ ఎక్కువైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus