జై లవకుశ ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ ధర!

  • May 26, 2017 / 07:29 AM IST

తెలుగు సినిమాలకు ఈ మధ్య ఓవర్సీస్ లో మంచి కలక్షన్స్ రాబడుతున్నాయి. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ లాభాలను పంచి పెడుతున్నాయి. అందుకే మన సినిమాలను కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఇక స్టార్ హీరో సినిమా అనగానే ముందుగానే భారీ ధరను కోట్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ ప్రాజక్ట్స్ లో జై లవ కుశ ఒకటి. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని బాబీ డైరక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమయినప్పుడే అన్ని ఏరియాల థియేటర్ రైట్స్ కోసం ఓ బడా సంస్థ 70 కోట్లు ఆఫర్ చేసింది.

ఆ ఆఫర్ ని కళ్యాణ్ రామ్ తిరస్కరించారు. తాజాగా ఓవర్సీస్ రైట్స్ కోసం 14 కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. నాన్నకు ప్రేమతో ఓవర్ సీస్ లో రెండు మిలియన్ డాలర్లు (14 కోట్లు) వసూలు చేసింది. జనతా గ్యారేజ్ 1 .8 మిలియన్ డాలర్స్ (13 కోట్లు) కలెక్ట్ చేసింది. ఇప్పుడు అంతే మొత్తాన్ని రైట్స్ కోసమే వెచ్చిస్తున్నారు. అంటే జై లవకుశ మూడు మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తుందని నమ్మకంతో ఈ అఫర్ ని ఇస్తున్నారు. ఈ డీల్ ని నిర్మాత హోల్డ్ లో ఉంచారు. సంప్రదింపుల అనంతరం అసలు ధర తెలుస్తుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus