హైదరాబాద్ లో పల్లెటూరు నిర్మించిన ‘రంగస్థలం’ టీమ్

  • July 19, 2017 / 01:43 PM IST

డైరక్టర్ సుకుమార్ మనల్ని పాతికేళ్ళు వెనక్కి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి గ్రామీణ యువకుడిగా రామ్ చరణ్ తేజ్ ని చూపించనున్నారు. ఈ రెండు విషయాలను రంగస్థలం 1985 సినిమా ద్వారా మన కళ్లకు కట్టనున్నారు. ఈ చిత్రం రాజమండ్రిలోని అందమైన ప్రాంతంలో రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, సమంతలపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్  హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఓ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్‌ని రూపొందించారు.

1985 రోజుల్లో, ఓ పల్లెటూరు ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. కళా దర్శకుడు రామకృష్ణ రూపొందించిన ఈ సెట్‌ కోసం 5 కోట్లు కేటాయించారు. ఈనెల 24 నుంచి మొదలై 35 రోజులు పాటు నిరంతరాయంగా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ తో పాటు జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు పాల్గొననున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus