ఆ సినిమా చూసాక మెగాస్టార్ చాలా బాధపడ్డారట…!

  • April 20, 2020 / 03:43 PM IST

30 ఏళ్లకు పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా రాణిస్తున్నారు మన చిరంజీవి. 10 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇచ్చి నాన్ బాహుబలి ఇండస్ట్రీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎంతో మంది కుర్ర హీరోలు … పవన్ , ప్రభాస్, మహేష్, చరణ్,ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఉన్నప్పటికీ… అంతకు మించిన ఈ రేంజ్ లో రాణించడం అంటే మాటలు కాదు. అది మెగాస్టార్ కు మాత్రమే సాధ్యం అయ్యింది.

అయితే ఎన్నో హిట్లు,బ్లాక్ బస్టర్ లు, ఇండస్ట్రీ హిట్లు… సాధించినప్పటికీ… కానీ మెగాస్టార్ ను బాధ పెట్టిన సినిమా ఒకటి ఉందట. అలా అని అది ఆయన ప్లాప్ సినిమా కాదు. మరో స్టార్ హీరో నటించిన సినిమా కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే… కమల్ హాసన్ హీరోగా కె.విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ‘స్వాతి ముత్యం’ సినిమా చూసి మెగాస్టార్ చాలా బాధ పడ్డారట. ఆ చిత్రం స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా దాదాపు విడుదల అయిన కేంద్రాలు అన్నిటిలో 100 రోజులు ఆడింది.

అయితే సినిమా రిజల్ట్ గురించి కాదు .. మెగాస్టార్ బాధ పడింది. ఆ చిత్రంలో కమల్ నట విశ్వరూపం చూసి… ‘ఇలాంటి నటనకు స్కోప్ ఉన్న చిత్రం ఒక్కటి కూడా నాకు దొరకలేదు.నాలో ఉన్న నటుడిని సంతృప్తి పరిచే.. ఇలాంటి సినిమా నాకు ఎప్పుడు దొరుకుతుందా అని’ మెగాస్టార్ బాధ పడుతుంటే… సుహాసిని గారు ఆ విషయాన్ని విశ్వనాధ్ గారికి చెప్పడం.. అటు తరువాత ఆయన మెగాస్టార్ తో ‘స్వయంకృషి’ చిత్రం చేయడంతో.. ఆ లోటు తీరిందట.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus