మహేష్ మూవీ స్క్రిప్ట్ కి రెండు నెలలు కష్టపడిన పూరీ జగన్నాథ్

  • May 8, 2017 / 01:51 PM IST

పోకిరి, బిజినెస్ మ్యాన్ .. మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలివి. ఈ చిత్రాలను తెరకెక్కించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మళ్ళీ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూసారు. ‘జన గణ మన’ కథని మహేష్ కి చెప్పానని పూరి జగన్నాథ్ పోస్ట్ చేయడం, తర్వాత ఆ కథ వేరే వారితో చేస్తాననడం వంటి అనేక మలుపులు తిరిగిన తర్వాత.. ఈ స్టోరీ చివరికి మహేష్ వద్దే ఆగింది. అయన వరుసగా ప్రాజక్ట్ లతో బిజీగా ఉండడంతో నెక్స్ట్ ఇయర్ ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తాజాగా తెలిసింది. రీసెంట్ గా ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ… “సాధారణంగా ఏ సినిమా స్క్రిప్ట్ అయినా రెడీ చేసుకోవడానికి నాకు 15 రోజులు మాత్రమే పడుతుంది.

అలాంటిది ‘జన గణ మన’ స్క్రిప్ట్ కోసం 2 నెలల సమయం పట్టింది” అన్నారు. “ఈ స్టోరీని మహేశ్ కి వినిపించాను. అతను ఇప్పుడు ద్విభాషా చిత్రాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. అందుకే ‘జనగణమన కూడా రెండు, మూడు భాషల్లో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. 2018లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది” అని పూరి జగన్నాథ్ మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus