అబ్బాయిలు మంచిగా ఉంటే అమ్మాయిలు సేఫ్ అంటున్న అనసూయ

  • September 17, 2016 / 11:24 AM IST

తెలుగు టీవీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యాంకర్లలో అనసూయ ఒకరు. ఇద్దరు పిల్ల ల తల్లి అయి ఉండి అందాన్ని కాపాడుకుంటూ అవకాశాలను పట్టేస్తోంది. అడల్ట్ కామెడీ షో తో ఫేమస్ అయినా ఈ బ్యూటీ నీతులు వల్లిస్తోంది. అబ్బాయిలకు మంచిగా ఉండమని చెబితే  అమ్మాయిలు తప్పకుండా సేఫ్ గా ఉంటారని ఈ రోజు ట్వీట్ చేసింది. అమితాబ్ , తాప్సీ నటించిన పింక్ సినిమా చూసి వచ్చి ఆ సినిమాలో థీమ్ గురించి హాట్ భామ అనసూయ ఇలా చెప్పినా.. నెటిజనులు మాత్రం సీరియస్ అవుతున్నారు.

పరోక్షంగా అబ్బాయిలపై సెటైర్ వేసిందని విమర్శిస్తున్నారు. అబ్బాయిల వల్ల  అఘాయిత్యాలు జరుగుతున్న విషయంలో కొంత నిజమున్నా, అందులో తప్పంతా అబ్బాయిలదేనని ఎలా నిర్ణయానికి వస్తావని అనసూయపై విరుచుకు పడుతున్నారు. లోకంలో అమ్మాయిల వల్ల నష్టమే జరగడం లేదా ? అని ప్రశ్నిస్తున్నారు. వివాదాలతో విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ భామ ఇందుకు ఏమంటుందో..!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus