Evaru Meelo Koteeswarulu: ఎన్టీఆర్ రియాలిటీ షో అప్ డేట్స్ ఇవే!

  • July 29, 2021 / 01:10 PM IST

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1 తర్వాత బుల్లితెర షోలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు పేరుతో రియాలిటీ షో ప్రారంభం కానుంది. మే నెల నుంచే ఈ రియాలిటీ షో ప్రారంభం కావాల్సి ఉన్నా వేర్వేరు సమస్యల వల్ల ఈ రియాలిటీ షో వాయిదా పడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆగష్టు 16వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది.

రామ్ చరణ్ ఫస్ట్ ఎపిసోడ్ కు హాజరు కాగా ఈ షోలో చరణ్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు గెలుచుకున్నారని సమాచారం. ఆగష్టు 16వ తేదీ తరువాత వరుసగా ఎపిసోడ్ లు ప్రసారం కానున్నాయి. ఇప్పటివరకు మొత్తం 16 ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తైందని ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తైన తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం.

కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర ద్వారా ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. హోస్ట్ గా తారక్ అంచనాలకు మించి మెప్పిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ రియాలిటీ షో కొరకు తారక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు తొలి ఎపిసోడ్ లో చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను కూడా అభిమానులతో పంచుకునే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus