ఆసక్తిగా మారిన ఎన్టీఆర్ మాటలు!!!

  • August 13, 2016 / 10:55 AM IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక నిన్న అభిమానుల కోలాహాలం మధ్య అంగరంగవైభవంగా జరిగింది. అయితే బ్రహ్మాండమైన వేడుకల ఎన్టీఆర్ కాస్త ఎమోషనల్ గా మాట్లాడిన తీరు అభిమానులను కలచి వేసింది. ఏమయిందో ఏమో తెలీదు కానీ ఎన్టీఆర్ కాస్త బాధతో మాట్లాడినట్లే అనిపించింది. తొలి రోజుల్లో వరుస హిట్స్ అందుకున్న ఎన్టీఆర్ కరియర్ ఇలానే ఉంటుంది అని అనుకున్నాడట.

అయితే వరుస పరాజయాలు పలకరించడంతో చాలా మదన పడ్డాడట. ఇక అదే క్రమంలో తన గమ్యం దూరం అయిపోతుంది ఏమో అని అనుకున్న క్రమంలో వక్కంతం వంశీ కధ చాలా స్పెషల్ గా ఉండడంతో, స్వతహాగా కధ రాసి మాత్రమే సినిమా తీసే పూరీ జగన్నాధ్ ఆ కధను మన చేద్దాం అని చేసిన సినిమా…టెంపర్ అని తెలుపుతూ…ఆ సినిమా హిట్ తో గమ్యం కాస్త దగ్గరగా అనిపించిందట….అదే క్రమంలో నాన్నకు ప్రేమతో సైతం గమ్యాన్ని మరింత దగ్గర చేసింది అని తెలిపాడు ఎన్టీఆర్.

ఇక జనతా గ్యారేజ్ గురించి మాట్లాడుతూ…తన గమ్యానికి మరింత చేరువ చేసే సినిమాగా జనతా గ్యారేజ్ ఉంటుంది అని. మోహన్ లాల్ లాంటి పెద్ద వాళ్ళతో పనిచెయ్యడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చాలా ఎమోషనల్ గా స్పీచ్ ముగించాడు ఎన్టీఆర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus