మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న సినిమా. 2026 మార్చి 27న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది.గ్లింప్స్ లో చివర్లో వచ్చే క్రికెట్ షాట్ ఏదైతే ఉందో.. అది సినిమాకి మంచి బజ్ ఏర్పడేలా చేసింది. కచ్చితంగా ‘పెద్ది’ (Peddi) బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అంచనాలు కూడా రేకెత్తించింది.
దీంతో నిర్మాతకి ఓటీటీ సంస్థల నుండి కాల్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నిర్మాత వెంకట్ సతీష్ కిలారు (Venkata Satish Kilaru).. ఓటీటీ సంస్థలతో మీటింగులు షురూ చేశారు. అన్నీ మంచి డీల్స్ వచ్చాయి. ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘పెద్ది’ (Peddi) డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్య పెద్ద సినిమాలకి కూడా ఓటీటీ డీల్స్ త్వరగా తెగడం లేదు. సకాలంలో షూటింగ్ వంటివి పూర్తి కాకపోవడం, నిర్మాతకి బడ్జెట్ పెరిగిపోవడం వంటి ఇతర కారణాల వల్ల.. అనుకున్న స్థాయిలో పెద్ద సినిమాలకి ఓటీటీ ఆఫర్లు రావడం లేదు. ‘విశ్వంభర’ (Vishwambhara) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) వంటి సినిమాలకు అదే జరిగింది. వాటి ఓటీటీ డీల్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు.
అయితే ‘పెద్ది’ (Peddi) సినిమాకి మంచి ఓటీటీ రూపంలో మంచి రేట్ దక్కింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ (Peddi) చిత్రం డిజిటల్ రైట్స్ ను అన్ని భాషల వెర్షన్లు కలుపుకొని రూ.105 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందట. ‘పెద్ది’ (Peddi) చిత్రం బడ్జెట్ రూ.250 కోట్లు పైమాటే. అయితే ఓటీటీ రైట్స్ రూపంలో రూ.105 కోట్లు వెనక్కి రావడం అనేది మంచి మాటే. థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.