Balakrishna, Nagarjuna: ఆ బాలయ్య సినిమా వల్లే నాగ్ తో గొడవలు వచ్చాయా?

  • January 25, 2023 / 08:48 PM IST

స్టార్ హీరోల సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లో రిలీజ్ కావడం వల్ల ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడుతుందనే సంగతి తెలిసిందే. బాలయ్య, నాగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. 2012 సంవత్సరంలో కేవలం 7 రోజుల గ్యాప్ లో బాలయ్య శ్రీమన్నారాయణ, నాగార్జున షిరిడి సాయి రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. అయితే స్టార్ హీరో బాలయ్య కొన్ని థియేటర్లను తనకు సెంటిమెంట్ గా భావిస్తారు.

కూకట్ పల్లి ఫేమస్ థియేటర్ లో శ్రీమన్నారాయణ సినిమా రిలీజై మంచి కలెక్షన్లను నమోదు చేస్తుండగా వారం రోజుల తర్వాత షిరిడి సాయి రిలీజ్ కావడంతో ఆ సినిమా కోసం శ్రీమన్నారాయణ మూవీని తీసేశారు. తన సినిమానే ప్రదర్శించే విధంగా బాలయ్య అడుగులు వేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. నాగార్జున వల్ల, నాగార్జున సినిమా వల్ల తన సినిమాకు నష్టం జరిగిందని భావించిన బాలయ్య అప్పటినుంచి నాగ్ ఫ్యామిలీని వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఒక సందర్భంలో అఖిల్ గురించి పరోక్షంగా బాలయ్య సెటైర్లు వెయ్యడం వెనుక అసలు రీజన్ ఇదేనని తెలుస్తోంది. బాలయ్య, నాగ్ కుటుంబాల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వివాదం విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆసక్తి చూపడం లేదు. ఒక హీరోకు సపోర్ట్ చేస్తే మరో హీరో కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

బాలయ్య కామెంట్లు చేసినా నాగ్ స్పందించకపోవడం గురించి కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య అక్కినేని ఫ్యామిలీ మధ్య వివాదం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus