ఇలా అయితే కష్టమే దేవరకొండ..!

  • August 30, 2019 / 01:05 PM IST

సెన్సషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తనని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ‘కింగ్ అఫ్ హిల్స్’ అనే బ్యానర్ ను స్థాపించి విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశాడు. షామర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు. సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనసూయ నటిస్తుంది అనే వార్త కూడా ప్రచారంలో ఉంది.

సాధారణంగా హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమీ కాదు. నాగార్జున దగ్గర్నుండీ ఇప్పుడు పవన్, మహేష్, చరణ్ వంటి వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాణ రంగం చాలా రిస్క్ తో కూడుకున్నది. నాగార్జున, పవన్, మహేష్, చరణ్ లాంటి హీరోలైతే వాళ్ళు స్టార్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు… అలాగే వెనుక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ పరిస్థితి అలా కాదు… ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. హీరోగా తన దృష్టి మొత్తం మంచి కథల ఎంపిక పై కాకుండా…. ఇలా నిర్మాణ రంగం పై పెట్టడమంటే చాలా కష్టం. హీరోగా సంపాదించిన డబ్బంతా నిర్మాణ రంగానికే ఖర్చయిపోతుంది అనడంలో సందేహం లేదు. మరి విజయ్ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus