తన ‘ఇజం’ను బాలీవుడ్ లో వినిపించనున్న పూరి

  • October 27, 2016 / 09:16 AM IST

ప్రచారం చిత్రాలతో ఎన్నో అంచనాలు పుట్టించిన పూరి ‘ఇజం’ తొలి ఆటతోనే వాటన్నిటినీ నీరు గార్చేసింది. క్లైమాక్స్ లో వచ్చే ఒక్క కోర్ట్ సీన్ కోసం రెండు గంటలు కదలకుండా కూర్చోవాలా..? అని అనుకోని ప్రేక్షకుడు లేడు. అయితే పూరి సంగతి తెలిసిందేగా ఎవరెన్ననుకున్నా నచ్చిన బాటలో సాగిపోవడమే అతగాడి పని. ఆ కోవలోనే ‘ఇజం’ సినిమాని బాలీవుడ్ కు తీసుకెళ్లనున్నాడట ఈ దర్శకుడు.బద్రి రీమేక్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు పూరి జగన్నాధ్. అక్కడికి పదేళ్ల తర్వాత అమితాబ్ తో ‘బుడా హోగా తేరా బాప్’ సినిమా చేశాడు. దానికంటే ముందు పూరి తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘పోకిరి’, ‘వాంటెడ్’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.

తర్వాత పూరికి అక్కడినుండి పలు అవకాశాలొచ్చినా ముంబై ఫ్లైట్ ఎక్కని పూరి బిజినెస్ మెన్, టెంపర్ అక్కడ రీమేక్ చేయాలని విలమయ్యారు. అదే కోవలో తన తాజా చిత్రం ‘ఇజం’ను హిందీలో తీయాలని పూరి ఆశిస్తున్నారట. అదీ సల్మాన్ ఖాన్ హీరోగా. పూరి ముఖం చూసి సల్మాన్ అవకాశమిచ్చిన స్క్రీన్ ప్లే మారాల్సిందే అన్నది అనుమానం లేని విషయం. ఇదిలా ఉంటే తెలుగు వెర్షన్ లో నటించి నిర్మించిన కళ్యాణ్ రామ్ బాలీవుడ్ వెర్షన్ కి నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. మొన్నామధ్య పాత్రికేయులతో ముచ్చటించిన పూరి బాలీవుడ్ సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందంటూ పెదవి విరిచారు. మరి ఇప్పుడాయన మాటేంటో..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus