రజనీకాంత్ ప్రొడ్యూసర్ పై మండిపడ్డ విశాల్!

  • May 24, 2016 / 02:36 PM IST

“నడిగర్ సంఘం” అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తమిళ కథానాయకుడు విశాల్ కు దూకుడు బాగా ఎక్కువయ్యింది. నిన్నమొన్నటివరకూ తన సీనియర్ హీరో అని కూడా చూడకుండా శరత్ కుమార్ పై నిప్పులు చెరిగిన విశాల్.. ఇప్పుడు తమిళనాట ప్రముఖ నిర్మాత అయిన కలైపులి థాను తో కయ్యానికి సిద్ధమవుతున్నాడు.

విషయం ఏంటంటే.. కలైపులి థాను నిర్మాణంలో తెరకెక్కిన “తేరీ” (తెలుగులో “పోలీసోడు”) సినిమా పైరసీ ఈమధ్య బాగా ఎక్కువయ్యింది. చెన్నై టి నగర్ లోనే సీడీలు రోడ్డుపై పెట్టి అమ్మేస్తున్నారు. ఈ పైరసీపై విశాల్ ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. ఫలితాలు శూన్యం. దాంతో.. తమ సినిమా పైరసీ విషయాన్ని నిర్మాత కలైపులి థాను పట్టించుకోకపోవడం పట్ల విశాల్ సీరియస్ అయ్యాడు.

నా సినిమా విషయంలో విశాల్ నాపై సీరియస్ అవ్వడం ఏంటీ? అతనికి పదవి ఉంది కదా అని ఎవర్ని పడితే వారిని ప్రశ్నిస్తా అంటే ఎవరు ఉరుకుంటారు. ఇకనైనా విశాల్ నిదానంగా వ్యవహరిస్తే మంచిది అని కలైపులి థాను పేర్కొన్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus