వారిని నిరాశపరుస్తున్న ఎన్టీఆర్ జై లవకుశ

  • July 1, 2017 / 07:00 AM IST

ఎన్టీఆర్ తొలి సారి త్రి పాత్రాభినయం చేస్తుండడం.. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ విలన్ రోల్ పోషించడం, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తుండడం వంటి అనేక ప్రత్యేకతల వల్ల జై లవ కుశ సినిమా విషయంలో నందమూరి అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ డిస్టిబ్యూటర్లు, బయ్యర్లు మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. కారణం రిలీజ్ డేట్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ప్రారంభించినప్పుడు సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. తారక్ సింగల్ గా వస్తున్నాడు కాబట్టి కలక్షన్స్ భారీగా ఉంటాయని బయ్యర్స్ ఆనందపడ్డారు. కానీ రీసెంట్ గా రిలీజ్ ని సెప్టెంబర్ 21 పోస్ట్ పోన్ చేశారు. దసరాకి రావడం బాగానే ఉంది కానీ .. ఆ వెంటనే మహేష్ బాబు స్పైడర్ (27), బాలకృష్ణ పైసా వసూల్ (29 ) రిలీజ్ కానున్నాయి.

దీనివల్ల థియేటర్స్ సంఖ్య తగ్గడంతో పాటు గట్టి పోటీ ఏర్పడుతుంది. ఈ ప్రభావం కలక్షన్ పై పడుతుంది. కాబట్టి భారీ ధరకు కొనుగోలు చేస్తే తక్కువ ఆదాయం చూడాల్సి వస్తుందని బాధపడుతున్నారు. అందుకే జై లవకుశని రెండు వారాలు ముందుగానైనా రిలీజ్ చేయమని నిర్మాత కళ్యాణ్ రామ్ ని బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరుకుంటున్నారు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus