ఎన్టీఆర్ “జైలవకుశ” కధ లీక్…పూనకాలు తప్పవట!

  • July 31, 2017 / 04:16 PM IST

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్…మొట్టమొదటి సారి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్న సినిమా “జై లవకుశ”. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకి ఫిదా అయిపోతారంట అందరూ…మరి అలాంటి సినిమా కధ ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కదా…మరి ఆ కధలో అసలు పాయింట్ లీక్ అయితే…వెంటనే తెలుసుకోవాలి అన్న కసి ఉంటుంది కదా…ఈ కధ చదివేయ్యండి..టాలీవుడ్ లో తారక్ ట్రిపల్ రోల్ చేస్తున్న జై లవకుశ సినిమాలోని కధ చాలా డిఫరెంట్ అని విన్నాం…కానీ ఆ కధలోని అసలు కోణం తెలిస్తే చాలా థ్రిల్ ఫీల్ అవుతాం…ఇంతకీ ఏంటి ఆ కోణం అంటే…మీరే చదవండి…మీకే అర్ధం అవుతుంది… జై లవ కుశ.. ముగ్గురు సోదరులు.. ఈ ముగ్గురికి తండ్రి ఒకడే కాని తల్లులు మాత్రం ఇద్దరు.

జై మొదటి భార్య కొడుకు.. కవలలు లవకుశ రెండో భార్య కొడుకులు. ఓ సంఘటనలో మొదటి భార్య చనిపోగా దానికి కారణం తండ్రి రెండో భార్యా కారణమని జై పగ పెంచుకుంటాడు. అందుకే లవకుశలను చంపాలని తిరుగుతుంటాడు. ఇక లవకుశలు ఇద్దరు కవలలు డ్రామా ఆర్టిస్టులుగా పనిచేస్తుంటారు. ఆ ఇద్దరిని చంపాలన్న జై కల నెరవేరిందా అన్నది అసలు కథట. అయితే ఈ కధలో ఎంతవరకూ నిజం ఉందో లేదో తెలీదు కానీ…మొత్తంగా చూసుకుంటే మాత్రం సినిమా సూపర్ హిట్ కధతోనే వస్తుంది అని చెప్పక తప్పదు…ఇక మరో పక్క …ఈ  సినిమాలో పోసాని కృష్ణ మురళి కూడా సినిమా మొత్తం కనిపిస్తాడట. మరి ఈ సినిమా ఎన్టీఆర్ కరియర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus