మారనున్న జై లవకుశ రిలీజ్ డేట్ ?

  • June 28, 2017 / 10:36 AM IST

నందమూరి బాలకృష్ణ తననీ ఎప్పుడూ చేరదీయనప్పటికీ, ఎన్టీఆర్ కి బాబాయ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పటివరకు ఆయన సినిమాలకు ఎదురెళ్లలేదు. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే తారక్ కనీసం నెల రోజుల గ్యాప్ తీసుకుంటారు. ఆ తరవాతే తన మూవీ విడుదల చేస్తుంటారు. తొలిసారి పొరపాటు జరిగింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ పైసా వసూల్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ప్రారంభం రోజునే సెప్టెంబర్ 29 న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. చెప్పినట్లుగానే ఆ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ విషయాన్నీ జై లవకుశ చిత్ర బృందం మరిచింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి కానుకగా సెప్టెంబర్‌ 21న థియేటర్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. దీంతో ఓ వారం గ్యాప్‌లోనే నందమూరి కుటుంబానికి సంభందించిన రెండు సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఈ విషయాన్నీ కొంచెం ఆలస్యంగా తెలుసుకున్న ఎన్టీఆర్ కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. బాబాయ్‌తో పోటీ పడి అభిమానులకు తప్పుడు సంకేతాలు పంపడం ఇష్టం లేక తన సినిమా విడుదల తేదీని మార్చమని నిర్మాత కల్యాణ్‌రామ్‌కు చెప్పారని తెలిసింది. కళ్యాణ్ రామ్ కూడా బాబాయ్ తో పోటీ పడడటం ఇష్టం లేక మరో రిలీజ్ తేదీ కోసం అన్వేషిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలవారు చెప్పుకుంటున్నారు. ముందుగా అనుకున్నట్లు జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన సెప్టెంబర్ 1 వ తేదీనే జై లవకుశ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus