నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న జై లవకుశ!

  • September 25, 2017 / 07:52 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తాని జై లవకుశ మూవీ దేశవ్యాప్తంగా తెలియజేసింది. తారక్ ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం గురువారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.  తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 31 .25  కోట్లు రాబట్టిన ఈ సినిమా వీకెండ్ మొత్తం అదే జోరు కొనసాగించింది. నాలుగురోజుల్లో ఈ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 62 కోట్ల గ్రాస్ ను, 40 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. ఓవర్ సీస్ లోను శనివారం వరకు ఈ మూవీ 1.28 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి ఆదివారంతో ఒకటిన్నర మిలియన్ల మార్కుకు చేరింది.

ఈ వారంలో సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ లోను ఏ చిత్రం నాలుగు రోజుల్లో ఇంతమొత్తంలో కలక్షన్స్ రాబట్టలేదు. దీంతో ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘జై లవ కుశ’ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దసరా సెలవులు కావడంతో ఈ వీక్ డేస్ లోను కలెక్షన్లు తగ్గవని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలోనే జై లవకుశ 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus