మూడు టీజర్లతో అదరగొట్టనున్న ఎన్టీఆర్

  • July 3, 2017 / 08:10 AM IST

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ మూవీ మొదలైనప్పటి నుంచి సంచనాలకు కేంద్ర బిందువైంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్  గతనెల రిలీజ్ అయి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించింది. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం టీజర్ ను ఈ నెల 6 వతేదీ సాయంత్రం 5.22 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. మరో న్యూస్ మరింత ఆనందం కలిగిస్తోంది. ఈ చిత్రానికి ఒక టీజర్ తోనే సరిపెట్టడం లేదు. ఇందులో ఎన్టీఆర్ పోషిస్తున్న మూడు పాత్రలు మూడు టీజర్లు రిలీజ్ చేయనున్నారు. మొదటగా అరవ తేదీ వచ్చే టీజర్ జై పాత్రకు సంబంధించింది.

వెంట వెంటనే లవ కుమార్, కుశ టీజర్స్ కూడా విడుదల చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఇలా అయితే సినిమా రిలీజ్ కి ముందే మూడు పాత్రలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోతుందన్నమాట. ప్రస్తుతం విలన్ పాత్రధారి రోనిత్ రాయ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ ని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 21 న థియేటర్లలో రావడానికి అందరూ కలిసి కట్టుగా శ్రమిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus