అదరహో అనిపించిన జనతా గ్యారేజ్ ట్రైలర్..!!

  • August 13, 2016 / 06:33 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా థియేట్రికల్ ట్రైలర్ జయహో అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ సందర్బంగా శుక్రవారం ట్రైలర్ ని విడుదల చేశారు. మొక్కలంటే ఇష్టపడే ఆనంద్ గా పరిచయమై, మోసగాళ్ల మక్కిలి ఇరిచే శక్తిగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటాడు. “మొక్కలతో పాటు మనుషులను కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది” .. “కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్లిపోతున్నాం” అనే డైలాగులను తారక్ తన స్టయిల్ లో చెప్పి దుమ్మురేపాడు.

కొరటాల శివ మిర్చి సినిమాలో పగలు, ప్రతీకారాలు వద్దనే మెసేజ్ ని ఇచ్చాడు. శ్రీమంతుడులో జన్మభూమిని అభివృద్ధి చేయాలని సూచించాడు. ఇప్పుడు అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న గ్లోబర్ వార్మింగ్ నుంచి ప్రకృతిని రక్షించాలనినే సందేశాన్నిజనతా గ్యారేజ్ ద్వారా అందిస్తున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన, డైలాగ్ డెలివరీ ఈ చిత్రానికి మరో బలం కానున్నట్లు ట్రైలర్ చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్ అభిమానులు డైరక్టర్ శివ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని ఈ వీడియో స్పష్టం చేసింది. ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండడంతో జయహో జనతా గ్యారేజ్ అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus