రామ్ చరణ్ సరసన శ్రీదేవి కూతురే బెటర్ అంటున్న రాజమౌళి

  • November 16, 2018 / 05:49 AM IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా మొదలైన “ఆర్.ఆర్.ఆర్” సినిమా గురించి రోజుకో కొత్త వార్త వింటూనే ఉన్నాం. ఈ సినిమా పేరు “రామ రావణ రాజ్యం” అని కొందరు వాదిస్తుంటే.. సినిమా యూనిట్ ఆల్రెడీ ఆ రూమర్ ను ఖండించింది. ఇక నిన్నటినుంచి ఈ సినిమాలో రష్మిక మండన్న కథానాయికగా ఫైనల్ అయ్యిందని గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ న్యూస్ కూడా ఫేక్ అని తేలిపోయింది. ఎందుకంటే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ను ఫైనల్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

శ్రీదేవి బ్రతికి ఉన్నప్పటి నుంచి ఆమె కుమార్తెను టాలీవుడ్ కి పరిచయం చేయాలి అనుకుంది కానీ కుదరలేదు. అయితే.. ఆమె మరణానంతరం బోణీ కపూర్ కు టాలీవుడ్ అంటే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో జాన్వీని అసలు ఇటువైపు రానివ్వలేదు. అయితే.. ఇప్పుడు రాజమౌళి సినిమా కావడంతో ఒకే చెప్పాడని తెలుస్తోంది. “బాహుబలి” సినిమాలో శివగామి పాత్ర విషయంలో రాజమౌళి-శ్రీదేవిల నడుమ చిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus