నాగార్జున కంటే ఎక్కువ అందుకోబోతున్న తారక రాముడు..!

  • March 17, 2021 / 09:05 PM IST

గతంలో ‘బిగ్ బాస్'(సీజన్ 1) రియాలిటీ షోని హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ఆ షోని సూపర్ సక్సెస్ చేసాడు.ఇక అతి త్వరలో జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోని కూడా హోస్ట్ చెయ్యబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలయ్యి ఎన్టీఆర్ అభిమానులను ఫిదా చేసింది. ‘ఆట నాది కోటి మీది’ అంటూ ఎన్టీఆర్.. రెట్టింపు ఉత్సాహంతో రెడీగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. దాంతో బుల్లితెర పై ఎన్టీఆర్ సందడి ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని స్పష్టమవుతుంది.

‘బిగ్ బాస్’ సీజన్ 1 లానే ఈ షో కూడా సూపర్ హిట్ అవుతుంది అని ఎన్టీఆర్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే షోని నాగార్జున, చిరంజీవి లు కూడా హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో మా టీవీలో టెలికాస్ట్ అయ్యేది ఈ షో. ఈసారి కాస్త పేరు మార్చి జెమినీ టీవీలో ప్రసారం చెయ్యబోతున్నారు నిర్వాహకులు. ఇక ఈ షోకి హోస్ట్ గా చేస్తున్నందుకు గాను ఎన్టీఆర్ ఎంత పారితోషికం అందుకోబోతున్నాడో తెలుసా.

అక్షరాలా రూ.7.50కోట్లు.ఇందులో మొదటి సీజన్ కు గాను 60 ఎపిసోడ్లు ఉంటాయట. ‘బిగ్ బాస్’ సీజన్ ను హోస్ట్ చేసినందుకు గాను రూ.4.5 కోట్ల వరకూ ఎన్టీఆర్ అందుకున్నాడట. ఈసారి మరింతగా పారితోషికం అందుకోబోతున్నాడని స్పష్టమవుతుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus